ఇస్లామాబాద్ : ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయీద్కు చెందిన జమాత్-ఉద్-దవా (జెయుడి), దాని అనుబంధ సంస్థ పాలహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఒత్తిడితో పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుఉన్నట్లు పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.