న్యూఢిల్లి : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎన్ఎస్సి) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు జైష్-ఎ-మొహ్మద్ కారణమని పేర్కొంది. ఇది అంతర్జాతీయంగా భారత్కు లభించిన ఘన విజయంగా భావిస్తున్నారు. యుఎన్ఎస్సి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది చాలా హేయమైన, పిరికిపంద చర్య … ఆత్మాహుతి దాడికి తామే కారణమని జైష్-ఎ-మొహ్మద్ తెలిపింది’ అంటూ యుఎన్ఎసి తన ప్రకటనలో పేర్కొంది.