ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుల్వామా ఘటనకు జైషే కారణమన్న యుఎన్‌ఎస్‌సి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 22, 2019, 10:07 AM

న్యూఢిల్లి : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (యుఎన్‌ఎస్‌సి) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు జైష్‌-ఎ-మొహ్మద్‌ కారణమని పేర్కొంది. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు లభించిన ఘన విజయంగా భావిస్తున్నారు. యుఎన్‌ఎస్‌సి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సెక్యూరిటీ కౌన్సిల్‌ సభ్యులంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది చాలా హేయమైన, పిరికిపంద చర్య … ఆత్మాహుతి దాడికి తామే కారణమని జైష్‌-ఎ-మొహ్మద్‌ తెలిపింది’ అంటూ యుఎన్‌ఎసి తన ప్రకటనలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com