ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ నేతల ఆరోపణలు శోచనీయమని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మంత్రి దేవినేని మీడియాతో మాట్లాుడతూ…. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రానికి రూ.10లక్షలకోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర సంస్థలే అవార్డులు ఇస్తుంటే బీజేపీ నేతల ఆరోపణలు శోచనీయంగా ఉన్నాయని మంత్రి దేవినేని అన్నారు.