నరేంద్ర మోడీ శాసిస్తే.. జగన్, కెసిఆర్ లు పాటిస్తారని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. గురువారం ఉదయం మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు లు విలేకరులతో సమావేశమయ్యారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేని శక్తులు ఒక కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నుతున్నాయన్నారు. టిఆర్ఎస్, మోడీ, జగన్ ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. జగన్ ఒక క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తియని, జగన్ టిడిపి ని ఎదుర్కోలేడనే వీళ్లంతా జగన్కి సహకరిస్తున్నారని చెప్పారు. కేంద్రం విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. విభజన లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్, మోడీ, జగన్ లు కలిసి రాష్ట్రానికి మరింత అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. జగన్ కుటుంబం చరిత్ర అందరికి తెలుసని చెప్పారు. ఎస్సి, ఎస్టీ, బిసి భూముల దుర్వినియోగానికి ప్రత్యేక చట్టాన్ని రాజశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చారన్నారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్ సొమ్ము రాష్ట్రానికి రావాల్సి ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్న జగన్ అధికారం ఇస్తారని ప్రజలు అనుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికీ ఎప్పటికీ.. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెంట ఉంటారని మంత్రి యనమల రామకఅష్ణుడు పేర్కొన్నారు. మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ శాసిస్తే.. జగన్, కెసిఆర్ లు పాటిస్తారని ఎద్దేవా చేశారు. అధికారం జగన్కి ఎండమావిగానే మిగులుతుందని, కుట్రలు కుతంత్రాలతో పని చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను, వర్గాలను రెచ్చగొట్టి అశాంతికి గురి చేయాలని.. జన్మోహన్ రెడ్డి గతంలోనూ ప్రయత్నించారని, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పీకే ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకొని సిఎం పదవి కోసం సంతకాల సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. చిన్న తనంలోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్మును దోచుకున్నాడని నిప్పులు చెరిగారు. మోడీ కి దాసోహమయ్యి కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. కెసిఆర్ ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం జగన్మోహనరెడ్డి వారితో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివఅద్ధి పథంలో నడుస్తోందని, జగన్ కి అధికారం ఇస్తే.. కుక్కలు చింపిన విస్త్రాకులా తయారవుతుందని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.