రాయదుర్గం : రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి, ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం నుండి రక్షించుకోవడానికి నియమ నిబంధనలు పాటించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఉదయం రాయదుర్గం మార్కెట్ యార్డులో నియోజకవర్గంలోని ప్రజలకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్ఎల్ఆర్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భద్రతా జీవితానికి రక్ష అని వేగంగా వాహనాలు నడవడం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయనే తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ల జాగ్రత్త వాహన యాంత్రిక లోపం సరైన రహదారులు లేనందున మరియు ఇతర వినియోగదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన సర్వేలో ప్రమాదాలకు 90 శాతం డ్రైవర్ల జాగ్రత్త కారణంగా వచ్చిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరు రహదారి భద్రత సూచనలు పాటించాలని పిలుపునిచ్చారు.
మీరు భద్రత పాటిస్తే భద్రతే మిమ్మల్ని రక్షిస్తుంది అన్నారు. అతివేగం ప్రమాదం అని ప్రయాణాల్లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని ఏ కుటుంబం నష్టపోకూడదని మంత్రి తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్లు వాడాలని, సెల్ పోన్ వాడరాదని మంత్రి సూచించారు. అలాగే మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదు అన్నారు. రోడ్లలో ట్రాఫిక్ ను గమనించి సహనంతో వాహనాలు నడపాలని తద్వారా చేరుకోవచ్చునని మంత్రి సూచించారు. నియోజకవర్గంలోని ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ కొరకు గుంతకల్లుకు వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అర్హులైన వారందరూ రాయదుర్గం మార్కెట్ యార్డ్ లో పాల్గొని ఐదురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్నిసద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి, మార్కెట్ యార్డ్ వైస్చైర్మన్ మాధవరెడ్డి, సాయినాథ్, ఎస్సై నాగేంద్రప్రసాద్, నాయకులు పసుపులేటి నాగరాజు, బండి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.