నాలుగు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ గెలుపులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. ఉద్యోగా సంఘాలతో నిన్న జరిగిన భేటీ సంతృప్తినిచ్చిందని... టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో తరుణంగా వైసీపీ నేతలు పలు రకాల కుట్రలకు పాల్పడతారని... వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు.