సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన సియోల్ చేరుకున్నారు. అక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. లొట్టే హోటల్ వద్దకు చేరుకున్న భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. కొందరు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు.