ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెంపోను ఢీకొట్టిన బైక్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 08:47 AM

చిత్తూరు జిల్లా పలమనేడు, కుప్పం జాతీయ రహదారిపై వి.కోట మండల పరిధిలోని దాసర్లపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మద్దిరాల గ్రామానికి చెందిన శంకరప్ప(52), దానమయ్యగారిపల్లికి చెందిన గోవిందప్ప(48), కొడగల్లుకు చెందిన గంగప్ప(44) ద్విచక్ర వాహనంపై దాసర్లనుంచి వి.కోటకు వెళ్తున్నారు. బారికేడ్లను అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు శంకరప్ప కృష్ణాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృత దేహాలను శవపరీక్ష నిమిత్తం పలమనేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకరామిరెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com