ఒకప్పుడు అమరావతిలో పనిచేయగలమా..? అని అనుకున్న పరిస్థితుల నుంచి నేడు పర్యాటక ప్రాంతంగా తీర్చిదద్దామని సీఎ చంద్రబాబునాయుడు అన్నారు. ల్యాండ్ పూలింగ్ భూములివ్వాలని రైతులను కోరాగా, అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులు భూములిచ్చారన్నారు. వారందరినీ మనస్ఫూర్తి అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఉష్ణోగ్రత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సచివాలయంలో అన్ని గదుల్లోనూ సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశామన్నారు. అదే తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారుల కార్యాలయాల్లో తప్ప ఎక్కడా ఏసీ సౌకర్యం ఉండదన్నారు. అలాగే, తెలంగాణ సచివాలయ గోడలపై ఉండే పాన్ ఉమ్ములను కడుక్కోడానికే సరిపోయేదన్నారు. శాశ్వత సచివాయలంలో మరింత ఆధునిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని, ఇందుకోసం జాతీయ స్థాయిలో చర్చిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.