పర్యాటక శాఖ అకౌంట్స్ ఆఫీసర్ శివరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో విజయవాడ రూరల్ ఎమ్మార్వోగా పనిచేసిన శివరావు... ప్రస్తుతం పర్యాటక శాఖలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేన్నారు. లబ్బీపేటలోని శివరావు నివాసంలో 25 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు చెక్కులను గుర్తించారు ఏసీబీ అధికారులు. కాగా శివరావుపై ఆదాయానికి మించిన ఆస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చాలా పకడ్బందీగా సోదాలు కొనసాగించారు.