దేశ సరిహద్దుల్లో 24 గంటలు పహారాకాస్తూ రక్షణ కల్పిస్తున్న సైనికులపై పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మాహుతి దాడి దురదృష్టకరమని శాసనసభా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ, అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని అసెంబ్లీలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు, డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణ, ఉన్నత అధికారులు, ఉద్యోగులతోపాటు పలువురు పాల్గొన్నారు.