జనాభా ప్రాతిపదికన కురుబ కార్పొరేషన్ కు నిధులుకేటాయించాలని ప్రభుత్వాన్ని కురబ కుల కార్పొరేషన్ చైర్మన్ ఎస్ సవిత కోరారు. బిసి కులాలకార్పొరేషన్స్ ఛైర్మెన్స్ తో బిసి కులాల కార్పొరేషన్స్ కో- ఆర్డినేటర్ రామారావుతో అమరావతిలో జరిగిన సమావేశంలో జరిగిన సమావేశంలో ఎస్ సవిత గారు మాట్లాడుతు రాష్ట్రంలో కురుబలు దాదాపు 40లక్షలమందివున్నారని బిసికార్పొరేషన్ లలో కేటాయించే నిధులలో జనాభాప్రాతిపదికన కేటాయించాలని కోరారు. అలాగే కనకదాసు జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా మదాసికురువ/మదారి కురువల కు ఎస్ సి సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆమె కోరారు.తెలుగు దేశం పార్టీ ఆవిర్బావం నుండి బిసిలు అండగా ఉన్నారని, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రణాళికాబద్దంగా ప్రజలలోకి వెల్తామని, అన్నారామె. కురుబ/కురువ లు కూడ టిడిపికి బాసటగా ఉన్నారని ఇతర పార్టీల వైపుఉన్నవారికి,తటస్తులకు బిసిలకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సమావేశాల ద్వారా వివరించి వారిని టిడిపి వైపుతీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తానని, టిడిపి విజయానికి శక్తి వంచనలేకుండా పనిచేస్తానని ఆమె తెల్పారు.