ఇటీవల రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తండ్రి వీరయ్య మరణించడం పట్ల మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బుధ వారం ఆయన గోరంట్లను అతని నివాసంలో కలుసుకుని పరామర్శించి, గోరుంట్ల కుటుంబానికి తన సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఏక్సైజ్ శాఖ మంత్రి శ్రీ K.S జవహర్,పశ్చిమ గోదావరి జిల్లా ZP చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు,మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు,జోన్నలగడ్డ చౌదరి తదితరులు రెడ్డి సుబ్రహ్మణం వెంట ఉన్నారు.