ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుకు కృత‌జ్ఞ‌త‌లు చెపుతూ భారీ రైతు ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 05:02 PM

రైతు బంధు పధకాన్ని  జిల్లా నుంచి శ్రీ‌కారం చుట్టినందుకు సిఎం చంద్ర‌బాబుకు కృతజ్ఞతలు తేలియజేస్తూ  రాజ‌మండ్రిలో భారీ రైతు ర్యాలీ జ‌రిగింది. బుధ‌వారం స్థానిక శాస‌న‌స‌భ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి నేతృత్వంలో జ‌రిగిన ఈ ర్యాలీలో వంద‌లాది మంది రైతులతో కలిసి కడియపుసావరం- కడియం, వేమగిరి జంక్షన్  మీదుగా   నందమూరి తారకరామారావు గారి విగ్రహాం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో   గోరంట్ల మాట్లాడుతూ:   రాష్ట్ర ముఖ్యమంత్రి   నారా చంద్రబాబు  రైతులకు పెట్టుబడి  సహాయం చేయాలనే ఉద్దశంతో ప్రకటించిన అన్నదాత  సుఖీభవ - రైతు భాందు పథకం ద్వారా ఇప్పటి వరకు మన నియోజకవర్గం రైతు సోదరులకు 1000/- రూపాయలు చొప్పున రైతుల అకౌంట్ లలో   పంపించడటం  జరిగినదన్నారు. 1000 రూపాయలు పడిన 5 ఎకరాలు ఉన్న చిన్న రైతులకు 14000 రూపాయలు అకౌంట్ లలో నేరుగా జ‌మవుతాయ‌ని, అలాగే 5 ఎకారాలు పైబడిన పెద్ద రైతులకు అన్నదాత  సుఖీభవ పథకంలో  9000 రూపాయాలు .మ‌కానున్నాయ‌న్నారు.  నియోజకవర్గంలోని కొంద‌రు రైతులు  త‌మ‌కున్న  భూమి వివరాలకు ఆధార్ లింక్  చేసుకోనందునే  1000/- రూపాయలు పడని విష‌యాన్ని గుర్తించి  టీడీపీ నాయకులు,కార్యకర్తలు,ఎంపీటీసీలు సర్పంచ్ లు  గ్రామాలలో రైతుల ఇళ్ల‌కు వెళ్లి  ఆధార్ కార్డు,రేషన్ కార్డు,బ్యాంకు పాస్ బుక్,పట్టాదారు పాస్ బుక్ కాపీలను  మండలంలో ఉన్న వ్యవసాయశాఖ అధికారులకు ఎం.పీ.ఈ.ఓ లకు  అందేలా చూస్తే త్వ‌రిత‌గ‌తిన   రైతన్నల అకౌంట్ లలో డబ్బులు పడటానికి ఆస్కారం ఉంద‌ని చెప్పారు. ఇందుకు  నియోజకవర్గంలో క్యాడర్ కృషి  చేయాలని మన నాయకులు ఒక్కటికి  రెండు సార్లు ఇంటింటికి తిరగాలని ఆయ‌న కోరారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com