అమరావతి : సచివాలయంలో మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం టిడిపి మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు కె.అచ్చన్నాయుడు, ఎండి.ఫారుఖ్, నక్కా ఆనంద్ బాబు, కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, నిమ్మల రామనాయుడు, జడ్పీ చైర్మన్ స్వాతిరాణి, కుటుంబరావు, పి.క్రిష్ణయ్య, పంచమూర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.