కొండవీడులో రైతు కోటయ్య మృతి చెందిన ప్రాంతాన్ని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధినేతపై మండిపడ్డారు. జగన్ చేసేవి శవరాజకీయాలని ఎద్దేవా చేశారు. కొండవీడులో హెలిపాడ్ కోసం రైతు కోటయ్య భూమి తీసుకున్నామని జగన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేవారు. ఒకవేళ నిరూపించలేకపోతే జగన్ రాష్ట్రాన్ని విడిచిపోవాలని సవాల్ విసిరారు. రైతు కోటయ్య మృతిని రాజకీయం చేయడం హేయమని మండిపడ్డారు. కోటయ్య మృతిపై విచారణ జరుగుతోందని చెప్పారు. కోటయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం హెలిపాడ్ కోసం నిర్మించిన స్థలం కోటయ్యది కాదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.