ముంబై : మహారాష్ట్రలో ఈ రోజు కిసాన్ లాంగ్ మార్చ్ నేడు ప్రారంభమైంది. రైతు సమస్యల పరిష్కారం డిమాండ్ లో రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొంటున్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ఆధ్వరంలో జరుగుతున్న ఈ మార్చ్ 27వ తేదీన ముంబైకి చేరుకుంటుంది. రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధర, సాగునీటి సౌకర్యాలు, రైతులకు పెన్షన్ డిమాండ్లతో రైతులు లాంగ్ మార్చ్ చేస్తున్నారు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసిం చేశాయని ఆరోపిస్తున్న రైతులు, ఏడాది గడిచినా గతంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకూ నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు.