అమరావతి: టికెట్ రాని వాళ్లే పార్టీని వీడుతున్నారని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈరోజిక్కడ చినరాజప్ప మాట్లాడుతూ వారి స్థానంలో సమర్థులే పోటీలో నిలుస్తారన్నారు. ఎన్నికల్లో మళ్లిd తెలుగుదేశం పార్టీదే విజయమన్నారు. కొండవీడులో రైతు కోటయ్యను కాపాడేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించారన్నారు. చంపడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ, బీజేపీ విధానమని విమర్శించారు.