పుల్వామా ఉగ్రదాడి మా పనేనంటూ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మరోసారి స్పష్టం చేసింది. అంతే కాకుండా ఉగ్రదాడి తామే చేశామని పేర్కొంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాలతో మరో వడియోను విడుదల చేసింది. దీంతో ఉగ్రదాడిలో మాకు సంబంధం లేదంటూ చెప్పుకుంటున్న పాక్ అధ్యక్షుడికి గట్టి షాక్ తగిలినట్లైంది. భారత్ పై దాడులకు తాము ఎప్పుడూ సిద్ధమేనంటే జైషే మహ్మద్ సంస్థ ఆ వీడియోలో పేర్కొన్నది. పాక్ గడ్డపై నుంచి ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రదాడి వెనుక మా హస్తం ఉదంనడానికి సాక్ష్యాలు చూపించాలి భారత్ కు సవాల్ విసురుతున్న ఇమ్రాన్ ఖాన్ కు ఆ సాక్ష్యాలను తానే అందించింది.