న్యూఢిల్లీ : అనీల్ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎరిక్సన్ కేసులో తప్పుడు అండర్ టేకింగ్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు అనీల్ అంబానీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్ కు ఆర్ కాం రూ.453 కోట్ల బకాయిలపై సుప్రీం లో కేసు నడుస్తున్న సంగతి విదితమే. నాలుగు వారాల్లోగా ఈ బకాయిలు చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సిందేనన్న సుప్రీం. అదే విధంగా కోర్టు పీజు కింద వెంటనే కోటి రూపాయలు చెల్లించాలనిన అనిల్ అంబానీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అండర్ టేకింగ్ ఇచ్చినందుకు ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని పేర్కొంది.