అమరావతి: ఏపీ అసెంబ్లీలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఏపీ అసెంబ్లీలో నివాళులర్పించారు. అమరులైన జవాన్లకు బుధవారం అసెంబ్లీలో సంతాప సభ నిర్వహించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. మృతి చెందిన జవాన్లకు స్పీకర్ నివాళులర్పించారు. జవాన్ల మృతికి సంతాప తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి దురదృష్టకరమని ఈ సందర్భంగా స్పీకర్ అన్నారు.