గన్నవరం: జవాను ప్రవీణ్కుమార్ పార్థివదేహం బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంది. పుల్వామా వద్ద సుందర్బార్లో విధి నిర్వహణలో ఉన్న ప్రవీణ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ స్వస్థలం విజయవాడలోని శాంతినగర్. ఈరోజు స్వస్థలంలో జవాను అంత్యక్రియలు జరుగనున్నాయి.