విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావుపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విశాఖ, శ్రీకాకుళం, బొబ్బిలి, నర్సీపట్నం సహా మొత్తం 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇటీవలే బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన శంకరరావుపై అనిశా దాడులు జరగడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.