అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసి సరిగ్గా ఇవాళ్టికి ఐదేళ్లు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నమ్మకద్రోహానికి ఐదో వార్షిక నిరసనలు జరపాలన్నారు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి ఐదేళ్లయిందన్నారు. ప్రత్యేక హోదాతో సహా మిగిలిన హామీలు గాలికి వదిలేశారన్నారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. బీజేపీ నమ్మకద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. ఆర్థికలోటులో నాలుగో వంతు కూడా చెల్లించలేదన్నారు. ప్రజాస్వామ్య అనివార్యత వల్లే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలతో కలిసి పని చేస్తామన్నారు.