అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ చేపటిన బస్సు యాత్ర ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. ‘ప్రత్యేక హోదా భరోసా’ ప్రజాయాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గార్లదిన్నెలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఊమెన్ చాందీ, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు కేవీపీ హాజరుకానున్నారు.