ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్ బయల్దేరిన జగన్ దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 09:00 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైెఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు వారం రోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుఝామున 4 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ లో జగన్ సతీసమేతంగా లండన్ వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్న కుమార్తె వర్షా రెడ్డి వద్దకు జగన్ దంపతులు వెళ్లనున్నారు. కుమార్తెను చూసివచ్చేందుకు గత నెలలోనే వెళ్ళాల్సి ఉన్నా రాష్ట్రంలోని అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడింది. సీబీఐ కోర్టు ముందస్తు అనుమతితో విదేశీ ‌ పర్యటనకు వెళ్ళిన జగన్ తిరిగి ఈ నెల 26న హైదరాబాద్ చేరుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com