దేశ రాజధాని ఢిల్లీ నగర పరిసరాల్లో భూ కంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదయ్యింది. బుధవారం ఉదయం 8.01 గంటల ప్రాంతంలో ఢిల్లీ పరిసరాల్లో భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తజకిస్ధాన్ దేశంలోని కోఫర్నిహన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. అయితే భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించి ఉందని జియోలాజికల్ సర్వే సంస్ధ పేర్కొంది. అయితే ఈ భూకంప ప్రకంపనలు మహారాష్ట్ర తీరవ వకూ వెళ్ళి ఉండవచ్చని అమెరికన్ జియోలాజికల్ సర్వే సంస్ధ అంచనావేస్తోంది.