దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని భులాభాయ్ దేశాయ్ మార్గ్ లోని ధరమ్ విల్లా భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బహుళ అంతస్తుల భవనంలో మంటలు వేగంగా వ్యాపించాయి. 4, 5,7,8 అంతస్తులలో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాద కారణాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు. భారీ ఆస్తి నష్టం సంభవించిందని చెబుతున్నారు.