ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పోరేషన్ డైరెక్టర్గా కర్రి వేణుమాధవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కానూరులోని బీసీ కార్పోరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత బీసీ కార్పోరేషన్ సంచాలకులు బి.రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని మరొక డైరెక్టర్ జ్ఞానం సుబ్బారావులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో పరిపాలనదక్షతలో అగ్రగామిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల సునామీతో దేశంలోనే వినూత్న పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా తనకు ఇంత మంచి పదవి బాధ్యతలు అప్పగించడంలో కృషి చేసిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ టి.డి.జనార్థన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కర్రి వేణుమాధవ్ కొనసాగుతున్నారు. కర్రి వేణుమాధవ్ ఇప్పటికే గడచిన రెండు దశాబ్ధాలుగా పలు బీసీ ఉధ్యమాల్లో కీలకపాత్ర వహిస్తున్నారు. ఆయనకు ఏపీ బీసీ కార్పోరేషన్ డైరెక్టర్గా పదవి రావడం పట్ల పలువురు బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కర్రి వేణుమాధవ్ను అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్పోరేషన్ ఛైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశృ్ విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సింహాద్రి కనకాచారి, బీసీ నాయకులు రాజశేఖర్ యాదవ్, హనుమంతరావు, పరబ్రహ్మం, పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు.