వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిండుమనసుతో ఆశీర్వదించాల్సిందిగా కర్ణాటక డైనామిక్ మంత్రి డికె శివకుమార్, సినియర్ మంత్రి డా. పరమేశ్వరు పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ఎపిసిసి అధ్యక్షు డా. రఘువీరారెడ్డి స్వగ్రామమైన నీలకంఠాపురంలో శ్రీ నీలకంఠేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను జరిపించి ప్రత్యేక హోదా భరోసా ప్రజా బస్సు యాత్రను ప్రారంభించారు. పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్కు చేరుకొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళుర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన భరోసా ప్రజా యాత్ర ప్రారంభసభలో వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ప్రధాని మోడి ఎపికి తీరని మోసం, ద్రోహం చేశారని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు పురిగొల్పిన అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో సరైన రీతిలో బుద్ది చెప్పాని వారు పిలుపునిచ్చారు. ఎపికి ప్రత్యేక హోదా అమలుతో పాటు విభజన చట్టంలోని హామీ అముకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ హోదా అమలుకు తొలిసంతకం చేస్తారని . ఐదు కోట్లప్రజకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందని అన్ని వర్గాల ప్రజలకు భరోసానివ్వాలని రాహుల్ ఆదేశించడంతోనే ఎపిలో హోదా భరోసా యాత్ర చేపట్టడం జరిగిందన్నారు.