కృష్ణాజిల్లాలో టిడిపి గెలుపు ఏకపక్షం కావాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. మంగళవారం ఆయన మచిలీపట్నం పార్లమెంట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ. జిల్లాలో 2ఎంపి, 16ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ గెలవాన్నారు. గత ఎన్నికల్లో 16కు 11స్థానాల్లో గెలచామన్నారు. ఈ 5ఏళ్లలో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేశామన్నారు. ఇప్పుడు అన్నిస్థానాల్లో ఘనవిజయం సాధించాలన్నారు. మచిలీపట్నం పోర్టు దశాబ్దాల కల నెరవేర్చామన్నారు. జిల్లాలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ది, పట్టిసీమతో కృష్ణాడెల్టా రైతాంగానికి ఎనలేని లబ్ది అన్నారు. 150 ఏళ్లలో జూన్లో నాట్లు వేయడం చరిత్ర అని అన్నారు.
నవంబర్లో తుపాన్ల నుంచి పంటు కాపాడామన్నారు. ముక్త్యా ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. ‘అన్నదాత సుఖీభవ’తో రైతుల్లో మంచి ఊపు. కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. 5ఎకరాు పైబడిన రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం. కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్రం ద్వారా సాయమన్నారు. కౌలురైతుకు రూ.9,654కోట్ల పంటరుణాలిచ్చాం. గతం కన్నా 20రెట్ల మేళ్లు కౌలురైతుకు చేశామన్నారు.
మహిళకు పసుపు-కుంకుమ కింద రూ.20మలు ఇచ్చామన్నారు. యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించామన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి బడ్జెట్ భారీగా పెంచామన్నారు. ఎన్నో వినూత్న పథకాలు తెచ్చామన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే గెలుపు ఏకపక్షం అవుతుందన్నారు.
తీవ్ర ఆర్ధికలోటులో కూడా సంక్షేమానికి భారీగా ఖర్చుచేశామన్నారు. టీడీపీపై ప్రజల్లో మంచి ఊపు, ఉత్సాహం ఉన్నాయి. ఆ ఉత్సాహాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అప్పుడే నాయకత్వ సామర్ధ్యం బైటపడుతుందన్నారు. ఇగో సమస్యలను వదిలేయాలి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం కావాలన్నారు. ఏమాత్రం ఏమరపాటుగా కూడదని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర, ఎంపి కొనకళ్ల, ఎమ్మెల్యేు తదితరులు పాల్గొన్నారు.
`````````