పెన్షన్లు, నిరుద్యోగ భృతి పెంపుతో పాటు డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ, రైతులకు అన్నదాత సుఖీభవతో ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిందని ఆర్.టి.జి సీఈవో ఎ.బాబు...సీఎస్ అనిల్ చంద్ర పునేఠకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జనవరి నెలలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయి 77.21 శాతం నమోదు కాగా, ఫిబ్రవరి లో 79.24కు చేరిందని, గత నెల కంటే ప్రస్తుత నెలలో 2.03 శాతం పెరిగిందని ఆర్.టి.జి సీఈవో ఎ.బాబు తెలిపారు. పశు సంవర్ధక శాఖ, ఐటీ, రెవెన్యూ, రవాణా, మున్సిపల్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిలను వివరించారు. మధ్యాహ్న భోజన పథకంలో గత నెల కంటే ఫిబ్రవరిలో 22.94 శాతం పెరిగిందని తెలిపారు. అన్నదాత సుఖీవ పేరుతో 48 లక్షల రైతుల ఖాతాల్లో ప్రభుత్వం మొదటివిడత రూ.1000లు జమ చేసిందన్నారు. మంగళవారం మరో 13 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 13.44 లక్షల రైతుల ఖాతాలను అప్ డేట్ చేయాలని కలెక్టర్లకు తెలిపారు. అనంతరం సీఎస్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ, రైతుల బ్యాంకు ఖాతాలను అప్ డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.