వైఎస్ జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటయ్య మరణంపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందన్న దానిపై నిజ నిర్ధారణ కోసం శాసన మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. రైతు మృతి విషయంలో చంద్రబాబు ఎందుకింత దిగజారారు అంటూ జగన్ విమర్శించారు. ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరుపైనా చర్చ జరిగింది. చంద్రబాబు ప్రకటించిన ఐఆర్ (మధ్యంతర భృతి)లో నిజాయితీ ఉందా? లేదా? అన్నది ఉద్యోగులకు అర్థం అవుతుందన్నారు. ఇప్పుడు ప్రకటించి జూన్లో ఇస్తాం అనటం మోసం కాక మరేమిటని జగన్ ప్రశ్నించారు. తనకు అధికారంలేని బడ్జెట్ మీద చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వమే కదా.. ఆరోజు నిర్ణయం తీసుకోవాల్సింది?, మరి చంద్రబాబు ఎలా ప్రకట చేస్తున్నారు? ఇది దగా కాదా?. చంద్రబాబు ప్రకటించగానే ఇప్పటికిప్పుడే అమలు చేస్తున్నట్టుగా ఆయనకు సన్మానాలు చేయడం ఏమిటని జగన్ విస్మయం వ్యక్తం చేశారు.