ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌పై పుస్తకం...ఆవిష్కరించిన గంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 09:12 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ 'అసాధ్యుడు, అనితరసాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌' పేరుతో రచించిన పుస్తకావిష్కరణ సభ విశాఖపట్టణంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి విశిష్ట అతిధిగా హాజరై పుస్తకం కాపీని అందుకున్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ, యార్లగడ్డ ఇప్పటివరకు ఎన్నో పుస్తకాలు రాశారని, అందులో కొన్ని సెన్సేషన్‌ సష్టించినవి కాగా, ప్రజల మన్ననలు పొందినవి ఎన్నో ఉన్నాయని, ఆ కోవలోకే ట్రంప్‌పై రాసిన పుస్తకం వస్తుందని చెప్పారు. రాష్ట్ర మానవ వనరుల అభివ ద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌ మాట్లాడుతూ ట్రంప్‌ జీవిత విశేషాలు తెలుసుకునేందుకు దాదాపు 6000 పేజీలు చదవాల్సి వచ్చిందన్నారు. అమెరికాలో ఎంతో మంది అభిప్రాయాలు సేకరించి పుస్తకాన్ని 150 పేజీలతో తీసుకువచ్చానన్నారు.జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పారు. ఆయనపై రాసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com