పదిహేను మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ నియమించారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. కమిటీ చైర్మన్ గా యనమల రామకృష్ణుడు, కన్వీనర్ గా కాలువ శ్రీనివాసులు, సభ్యులుగా అచ్చెంనాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎఎమ్డీఫరూక్, కిడారి శ్రవణ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్, భూమా బ్రహ్మానందరెడ్డి, సీ.కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, శోభా స్వాతిరాణి, పి.కృష్ణయ్యలను నియమించారు. 2019 లో జరుగబోయే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన మేనిఫెస్టోలో ఏఏ అంశాలు పొందు పరచాలి, ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వాలి.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వాలనే అంశాలను రూపొందించనుంది.