స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వారి ఆధ్వర్యంలో మంగళవారం తమిళనాడులోని మహాబలిపురం నందు రక్షిత నీటి పై జాతీయ సభ జరిగింది. ఈ సభలో అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. లక్ష్మీపార్థసారథి రాజధాని అమరావతిలో ఏడిసి చేపడుతున్న రక్షిత మంచినీటి సరఫరాపై ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరంలో 2050 నాటికి 3 మిలియన్ల జనాభాకు అనుగుణంగా 24 by 7 తరహాలో ఆధునిక స్మార్ట్ వాటర్ ప్లాన్ రూపొందించినట్లు సభలో వివరించారు. ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి పట్టణ అభివృద్ధి సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడిసి ముఖ్య ఇంజినీరు శ్రీ టి. మోజెస్ కుమార్ ఉన్నారు.