ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆదరణ లేకే పార్టీలు మారుతున్నారు- మంత్రి నక్కా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 08:06 PM

టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారు లోటస్‌ పాండ్‌లో విజయసాయిరెడ్డి స్క్రిప్ట్‌ చదువుతున్నారు. గుంటూరు తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ... ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టికెట్స్‌ లేవని తెలిసి వైసీపీలో చేరి కులాలు, అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరం అన్నారు. ప్రజా ప్రయోజనాలను కాంక్షిన మీరు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదన్నారు. అవినీతికి జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అలాంటి  అవినీతి పరుల పంచన చేరిన మీకు అవినీతి మకిలి పట్టిందన్నారు. మీ రాజకీయ జీవితంలో చెరగని మచ్చను వేసుకున్నారని విమర్శించారు. టిడిపిలో ఉన్నప్పుడు అవినీతి పరుడుగా  కనిపించినా జగన్‌ మీకు ఇప్పుడు నీతిపరుడుగా కన్పిస్తున్నారా? రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న బీజేపీ, కేసీఆర్‌లతో చేతులు కలిపిన చిన్న మోడీతో మీ స్వార్ధ రాజకీయాల కోసం జగన్‌తో కలవడం  చారిత్రక తప్పిదమన్నారు.  రాష్ట్ర ప్రజలకు వైకాపా నేతలు తీరని ద్రోహం చేస్తున్నారని,  వైకాపా నేతల బీఫాంలు ఇచ్చేది టిఆర్‌ఎస్‌ని  తెలిపారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ అసభ్యకరమైన మాటలతో కించపరిస్తే నేడు జగన్‌ ఆయనతోనే పొత్తు పెట్టుకోని రాష్ట్ర ప్రజలను అవహేళన చేశారని  అన్నారు. మీకు ప్రజల మనోభావాలు పట్టవా? రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడితే కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని చెప్పినా అవంతి, పండుల రవీంద్ర నేడు కేసీఆర్‌తో లాలూచీ పడి హోదాను ఏ విధంగా సాధిస్తారో  చెప్పాలన్నారు. స్థానికంగా ప్రజల ఆదరణ పొందలేక స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుస్తూ ప్రజలు మీపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేస్తూ మీరు చేసే రాజకీయం దీర్ఘకాలం మనలేదని తెలిపారు.  టిడిపిని విమర్శించే అర్హత జగన్‌కు లేదని  ఆ నోటితోనే తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా మీరు వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు త్వరలనో బుద్ధి చెబుతారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానికి చెందిదని చెబుతున్న మీరు నాలుగున్నరేళ్లుగా చేసిన పెత్తనం గుర్తుకు రాకపోవడం దౌర్బాగ్యమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని తెలంగాణ సభలోనే కాంగ్రెస్‌ పార్టీ ధైర్యంగా చెప్పి చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తుచేశారు.  సిద్ధాంతాలు, విలువలు లేని రాజకీయాలు చేయాలనుకోవడం సమంజసం కాదని  మీ రాజకీయ ప్రయోజనం కోసం అవినీతి పరుల పంచన చేరడం మీ స్థాయిని దిగజార్చిందని విరుచుకుపడ్డారు.  రాష్ట్ర ప్రజలందరికి  వైసీపీ, టిఆర్‌ఎస్‌ లాలుచీ గురించి  అర్ధమైతోందని అన్నారు. దమ్ముంటే కేసీిఆర్‌, కేటీఅర్‌ ఆంధ్రాకి వచ్చి వైసీపీ తరుపున ప్రచారం చేయాలనీ సవాలు విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com