టిటిడి 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రూ.3,116.25 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఇందులో హుండీ ద్వారా రూ.1,231 కోట్లు, పెట్టుబడులపై వడ్డీ ద్వారా రూ.845.86 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.1,039.39 కోట్లుగా రాబడిని అంచనా వేశారు. అదేవిధంగా, ఇందులో భక్తుల సౌకర్యాలు, దేవాలయాల నిర్మాణానికి రూ.100 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.210 కోట్లు, హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు రూ.179 కోట్లు, విద్యకు రూ.127.5 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు రూ.139 కోట్లు కేటాయించారు.