ఎంపీ రవీంద్రబాబు గంటల వ్యవధిలోనే పార్టీ మారిపోయారన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.మంచి స్నేహితుడిగా ఉన్న రవీంద్రబాబు తనపై ఎందుకు విమర్శలు చేశాడో అర్థం కావడం లేదన్నారు. గెలిచేవారికే టీడీపీలో టికెట్లు ఇస్తున్నారని…గెలవలేం అనుకున్నవారే పార్టీ మారుతున్నారని గల్లా విమర్శించారు. అక్కినేని నాగార్జున తనకు మంచి స్నేహితుడని… జగన్ను కలిసినంత మాత్రాన నాగార్జున రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాదన్నారు గల్లా జయదేవ్.