నిర్భయ పథకం కింద బాధితులకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.62 కోట్లు మంజూరు చేస్తున్నట్టు హోం శాఖ జీవో 153 విడుదల చేసింది. హింసకు గురైన మహిళలు, బాలికలు పరిహారం కోసం జిల్లా కోర్టుల్లోని న్యాయ సేవా అథారిటీల్లో సంప్రదించాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్. అనూరాధ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు అవసరమైన డాక్యుమెంట్ల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లలో అధికారులను సంప్రదించాలని అనూరాధ కోరారు.