శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖినది పుష్కరం కన్నుల పండువగా సాగింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వర్ణముఖినదికి ప్రతిఏటా పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్కరాన్ని ఏటి ఉత్సవం, త్రిశూలస్నానం అని కూడా అంటారు. పుష్కరం సందర్భంగా శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్రస్నానం, త్రిశూల స్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. స్వామి, అమ్మవారు, వినాయకస్వామి, సుబ్రమణ్యంస్వామి, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖినదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా తవ్వించిన గుంత వద్ద వేదపండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం చక్రాలకు, త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు. మాఘస్నానం నది పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు.
ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగిందిస్వర్ణముఖినదిలో పంచమూర్తులకు సద్యోముక్తి వ్రతాన్ని నిర్వహించిన తర్వాత పురవీధుల్లో అంగరంగ వైభవంగా . స్వామివారు నందివాహనం, అమ్మవారు సింహవాహనం, సుబ్రమణ్య స్వామి నెమలి వాహనం, వినాయకుడు మూషిక వాహనంపై ఊరేగుతారు