తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకాలం టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ... వైసీపీ అధినేత జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ తరపున సత్తెనపల్లి అసెంబ్లీ లేదా నరసరావు పేట ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మోదుగులకు చంద్రబాబు టికెట్ ను నిరాకరించబోతున్నారనే ప్రచారం గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారినట్టు సమాచారం.