రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సారధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల24 వతేది ఆదివారం దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో శ్రీ శ్రీనివాస కళ్యాణo నిర్వహిస్తున్నారు.మంగళవారం దర్శి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో శ్రీనివాస కళ్యాణo నిర్వహించడాని గ్రైండ్స్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రైండ్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణo నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దర్శిలో జరిగే శ్రీనివాస కళ్యాణo కు 50 వేల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శ్రీనివాస కళ్యాణo కార్యక్రమానికి భారి ఎత్తున భక్తులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ పి.సంజీవయ్య, వైస్ ఎంపీపీ ఎం.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.