పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి గత వారం రోజులుగా లెఫ్ట్నెంట్ గవర్నర్ నివాసం వద్ద చేస్తున్న దీక్ష విరమించారు. పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ (ఎల్జి)తో సమావేశం అనంతరం సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత నారాయణ స్వామి దీక్ష విరమించారు. వివిధ పథకాలపై ఎల్జితో చర్చించామని ఆయన చెప్పారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వృద్ధులకు 10 వేల రూపాయిల నెలవారీ ఆర్థిక సహాయం, వితంతువులకు పెన్షన్, రైతులకు చెల్లించడానికి నిధుల కోసం సహకార చక్కెర ఫ్యాక్టరీ వేలం తదితర అంశాలపై ఎల్జితో చర్చించినట్లు నారాయణ స్వామి చెప్పారు.