ఉప రాష్ట్రపతి రేపు ప్రారంభించనున్ననెక్లెస్ రోడ్డు పనులు ఊపందుకున్నాయి. నెల్లూరు నెక్లెస్ రోడ్డు పనులను మంత్రి నారాయణ బైక్ పై వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాల చెరువు కట్టపై నెల్లూరుకు మణిహారంగా నెక్లెస్ రోడ్డున తీర్చిదిద్దుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెక్లెస్ రోడ్డు గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని, చెరువు కట్టపై రెండు కిలోమీటర్ల మేర రోడ్డును, సైకిల్, వాకింగ్ ట్రాక్ లను సిద్ధం చేశామన్నారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద 200 మీటర్ల ఘాట్ ను ఏర్పాటు చేశామన్నారు. లబ్దప్రతిష్ఠులైన ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు అభివృద్ధిలో గతానికి, నేటికి తేడా కళ్ళముందు కనబడుతుందని వ్యాఖ్యానించారు. పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాన్ని కూడా ఈ విషయం తెలుసన్నారు. అభివృద్ధి జరుగుతుందనే విషయం అంగీకరించాలా ? వద్దా ? అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.