ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండవీడు కోటను ప్రంపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి పుల్లారావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 01:07 PM

ప్రభుత్వం కౌలు రైతులు, 5 ఎకరాల పైబడి ఉన్న రైతులకు రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తుంది మంత్రి పుల్లారావు. మొదటిగా భూమి ఉన్న రైతులకు అన్న దాత సుఖిభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం . కౌలు రైతులందరిని గుర్తించిన తర్వాత మే, జూన్‌లో కౌలు రైతులకు పెట్టుబడి సాయం అదిస్తాం.ముఖ్యమంత్రి లిప్టులన్నింటిని పుననిర్మాణం చేసి చివరి ఎకరావరకు నీరు ఇచ్చారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రధాన్యం ఇచ్చి రూ. 70 వేల కోట్లు ఖర్చు చేసింది . పంటల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం మద్ధతు ధరతో పంటను కొనుగోలు చేస్తోంది 


ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. పంటలకు దిగుబడి విషయంలో అన్ని రాష్ట్రాలకు కంటే ముందున్నాం.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వ్యవసాయంలో చారిత్రాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. ఏప్రిల్ 5 లోపల రైతు రుణమాఫీ 10శాతం వడ్డితో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథాకానికి రూ 2 వేల కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు సమర్థతో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభపవపేరుతో  చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం 


కేంద్ర ప్రభుత్వం కంటే ముందే రైతుల ఖాతాల్లో రూ వేయి రూపాయలు జమ చేశాం . కొండవీడు కోటను ప్రంపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ప్రతి ఏటా కొండవీడు కోట ఉత్సవాలను నిర్వహిస్తాం . కొండవీడు కోట ఉత్సవాలను విజయవంతం చేయడానికి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మంత్రి పుల్లారావు తెలిపారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com