బెంగళూరు: కర్ణాటకలోని యెలహంక ఏయిర్బేస్లో ‘ఎయిరో ఇండియా - 2019’ షో కోసం చేస్తున్న సన్నాహాక ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ నెల 23న బెంగళూరులో ప్రారంభంకానున్న ఎయిరో ఇండియా ప్రదర్శన కోసం పైలట్లు రిహార్సల్స్ చేస్తున్నారు. రిహార్సల్స్ చేస్తుండగా సూర్యకిరణ్ ఏయిరోబాటిక్స్ టీమ్కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.