చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే, పీఎంకే మధ్య లోక్ సభ ఎన్నికల పొత్తు ఖరారైంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరుపార్టీలు అంగీకారం తెలిపాయి. చెన్నైలో అన్నాడీఎంక, పీఎంకే నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమావేశంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం, పీఎంకే నేత జీకే మణిలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఒప్పంద పత్రాలపై ఇరుపార్టీల నేతలు సంతకాలు చేశారు.