గాజువాక : విశాఖపట్నం జిల్లా గాజువాక పట్టణంలోని కూర్మన్నపాలెం సిగ్నల్ కూడలి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అనకాపల్లి బస్టాప్ ఎదురుగా ద్విచక్ర వాహనంను ఫాల్కన్ మెరైన్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ కు చెందిన ట్రక్కు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి వయస్సు సుమారు (40)సం వుంటుంది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.