న్యూఢిల్లి : సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నేడు భారత్కు రానున్నారు. సోమవారం పాకిస్తాన్లో పర్యటించిన సల్మాన్ పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భారత్తో చర్చల కోసం పారదర్శకంగా చేస్తున్న కృషి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బుధవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీతో సల్మాన్ భేటీ అనంతరం భారత్, సౌదీ అరేబియాలు ఉగ్రవాదంపై ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.